విండోస్ 8 రూ. 699కే

జూన్ 2, 2012 నుండి జనవరి 31, 2013లోపు Windows 7తో కూడిన లాప్‌టాప్ గానీ, పిసి గానీ కొని ఉంటే కేవలం రూ. 699కే Windows 8కి అప్‌గ్రేడ్ కావచ్చొని, ఆ ఆఫర్ త్వరలోకి అందుబాటులోకి వస్తుందని గతంలో రాశాను మీకు గుర్తుండే ఉంటుంది.
ఇటీవల ఆగస్ట్ 21, 2012)న మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ ఆఫర్‌ని మనకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే జూన్ 2 తర్వాత మీరు లాప్ టాప్ కొన్నా, జనవరి 31, 2013 లోపు కొనదలుచుకున్నా https://windowsupgradeoffer.com/ అనే సైట్‌లో మీ కొనుగోలు వివరాలు రిజిస్టర్ చేసుకోండి. ఇలా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే Windows 8 అమ్మకానికి సిద్ధం అయినప్పుడు ఆఫర్ క్రింద రూ. 699కే లభిస్తుంది.
ఈ ఆల్బమ్‌లో నేను జూన్‌లో కొన్న లాప్‌టాప్‌ని రిజిస్టర్ చేసుకునే ప్రొసీజర్‌ని డెమో చేస్తున్నాను. చూడొచ్చు.
గమనిక: కొత్త లాప్‌టాప్, పిసిలు కొనే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ ఆల్బమ్‌ని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేసుకోవడం ద్వారా వారూ ప్రయోజనం పొందేలా చూడగలరు.